ఆచితూచి ఆడుతున్న భారత్..

SMTV Desk 2018-01-06 16:07:34  south africa, india, 1 st test, rohith sharma, pujara

కేప్‌టౌన్‌, జనవరి 6 : దక్షిణాఫ్రికా తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత్ ఆచితూచి ఆడుతుంది. 28/3 ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆట ప్రారంభించిన రోహిత్ శర్మ, పుజారా, సఫారీ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ (11) రబాడ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరగాడు. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా జట్టు 36 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్ (12) , పుజారా (26) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఇంకా 210 పరుగులు వెనుకబడి ఉంది.