కేప్ టౌన్, జనవరి 6 : కేప్ టౌన్ వేదికగా న్యూలాండ్స్ మైదానంలో సౌతాఫ్రికా - భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత క్రికెటర్ల సతీమణులు సందడి చేశారు. ఇటీవల వివాహం చేసుకున్న కోహ్లి, భువనేశ్వర్ భార్యలతో పాటు, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, జీవిత భాగస్వాములు కూడా ఉన్నారు. వీరందరూ గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించారు. మైదానంలో కోహ్లీసేన ఫీల్డింగ్, బ్యాటింగ్ చేస్తున్నంత సేపు గ్యాలరీలో కూర్చున్న అనుష్క తదితరులు భారత క్రికెటర్లను ప్రోత్సహ౦ అందించారు. గతంలో ఐపీఎల్, ఆస్ట్రేలియాతో మ్యాచులకు అనుష్క హాజరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి ఫొటోలు అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్నాయి. ఆటగాళ్ల లక్కీ ఛార్మ్ గర్ల్స్ వీరే అంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తెగ ట్వీట్లు చేస్తున్నారు.