హైదరాబాద్, జనవరి 6 : ట్రిపుల్ తలాక్ బిల్లుపై టీఆర్ఎస్ తీరు ఏంటి.? అని శాసన మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. ఎలాంటి అభిప్రాయాన్ని ప్రకటించకుండా ఆటలాడుతోందని వ్యాఖ్యానించారు. రాజ్భవన్ ఎదుట మీడియాతో మాట్లాడిన ఆయన.. "అన్ని పార్టీలు ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. రాజ్యసభలో టీడీపీ, అన్నాడీఎంకే, బిజూజనతాదళ్ సైతం బిల్లును వ్యతిరేకించారు. కాని టీఆర్ఎస్ మాత్రం ఎలాంటి అభిప్రాయం ప్రకటించకుండా వాకౌట్ చేసి ఊరుకుంది" అంటూ ఎద్దేవా చేశారు.