టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ..

SMTV Desk 2018-01-05 22:42:24  india, south africa, 1 st test, cap town, new lands

కేప్ టౌన్, జనవరి 5 : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పేస్ కు అనుకూలించే పిచ్ పై సఫారీ బౌలర్లు రెచ్చిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 286 పరుగులకే ఆలౌటైంది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్(1), శిఖర్ ధావన్ (16), కెప్టెన్ కోహ్లీ(5) వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 3 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(0), పుజారా(5) ఉన్నారు. ప్రోటీస్ జట్టులో మెర్కెల్, ఫిలాండర్‌, స్టెయిన్‌ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగులు వెనకబడి ఉంది.