న్యూఢిల్లీ, జనవరి 5 : భారత్ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) నోటీసులు జారీ చేసింది. ఇటీవల డిసెంబర్ 29న కామన్వెల్త్ క్రీడల రెజ్లింగ్ సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా సుశీల్, మరో రెజ్లర్ రాణా మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి విధితమే. దీంతో పర్వీన్ రాణా సోదరుడు నవీన్ రాణా సుశీల్, అతని మద్దతు దారులపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘర్షణ పై పర్వీన్ రాణా డబ్ల్యూఎఫ్ఐను ఆశ్రయించాడు. దీంతో గొడవపై వివరణ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్ఐ తాజాగా సుశీల్కు నోటీసులు జారీ చేసింది.