రాంచీ, జనవరి 5 : పశు దాణా కేసులో నిందితుడిగా ఉన్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ శిక్షపై వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని కారణాల వల్ల శిక్షను వాయిదా వేసిన కోర్టు రేపు మధ్యాహ్నం తీర్పు వెల్లడించనుంది. ఈ తీర్పు కూడా శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరగనుందని లాలూ తరఫు న్యాయవాది చిత్తరంజన్ సిన్హా వెల్లడించారు. శుక్రవారం లాలూకి శిక్ష ఖరారు చేసే దానిపై వాదోపవాదాలు ముగిశాయి. తన వయసును, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శిక్షను తగ్గించాలని లాలూ శుక్రవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం జరిగిన ఈ కేసు విచారణకు లాలూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.