హైదరాబాద్, జనవరి 5 : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కేటిఆర్ దివ్యాంగుల కోసం నేడు హైదరాబాద్ లోని మలక్పేటలో బ్రెయిలీ పార్క్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్మాట్లాడుతూ...దివ్యాంగుల కోసం ప్రభుత్వాలు ఎంత చేసినా తక్కువేనని ఆయన అన్నారు. అంతేకాకుండా తెలంగాణలో త్వరలో మరో ఆరు బ్రెయిలీ పార్కులు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.అనంతరం, నగరంలో కొందరు కార్పొరేటర్లు ఇండోర్ స్టేడియం ప్రారంభంలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వారికి జరిమానా విధించారు.