భళా..భువి..

SMTV Desk 2018-01-05 15:11:24  INDIA, BHUVANESHWARA KUMAR, SOUTH AFRICA, TEST, CAP TOWN

కేప్ టౌన్, జనవరి 5 : సఫారీలతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ అదిరే శుభారంభం దక్కింది. స్వింగ్ స్పెషలిస్ట్, భువనేశ్వర్ కుమార్ ఏకంగా మూడు వికెట్లు తీసి సఫారీల శిబిరంలో ఆందోళన రేకిత్తించాడు. భువి తన తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ ఎల్గర్(0)ను అవుట్ చేసి సౌతాఫ్రికా జట్టుకు షాకిచ్చాడు. తర్వాత ఆదే ఊపులో మార్క్ రమ్ (5) హషీం అమ్లా(3), పెవిలియన్ కు పంపాడు. 16.2 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా జట్టు 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డివిలియర్స్(37), డుప్లెసిస్(17) ఉన్నారు.