కేప్ టౌన్, జనవరి 5 : భారత్- సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఫ్రీడమ్ సిరీస్ తొలి టెస్ట్ లో భాగంగా ప్రోటీస్ కెప్టెన్ డుప్లెసిస్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ తో టీమిండియా తరపున పేసర్ బుమ్రా అరంగేట్రం చేయనున్నాడు. మరో వైపు సఫారీలతో మంచి రికార్డున్న రహనే తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మరో వైపు ప్రత్యర్ధి జట్టులోకి సఫారీ పేస్ ఎక్స్ ప్రెస్ స్టెయిన్ రావడంతో వారి బౌలింగ్ బలం మరింత పెరగనుంది.