మైనర్ బాలిక పై సాముహిక అత్యాచారం

SMTV Desk 2017-06-20 13:16:29  bihar, mainar girls, rep,

పట్నా, జూన్ 20 : మరో విషాదం బీహార్ లో చోటు చేసుకుంది. పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ఆరుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం రోజు రాత్రి బాలిక ఒంటరిగా బహిర్భూమికి వెళ్ళిన సమయంలో నిందితులు బలవంతంగా ఎత్తుకెళ్ళి అరుగురు వ్యక్తులు అత్యాచారం చేసారని, అనంతరం బాలికను బాన్షీపూర్ రైల్వే స్టేషన్ కు తీసుకెళ్ళి బలవంతంగా రైలులోకి ఎక్కించి, రైలు కదులుతున్న సమయంలో బయటకు నేట్టేసారు. అక్కడున్న స్థానికులు బాలికను ఆసుపత్రిలో చేర్పించగా ఆమె నడుము కు ఫ్యాక్చార్ అయ్యిందని వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన వారి కోసం గాలింపులు చేపట్టారు. వీరి కోసం బీహార్ ప్రభుత్వం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు. ఈ అత్యాచారం చేసిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, అతను మైనర్ బాలుడు కావడం వలన జ్యుడిషియల్ కస్టడికి అప్పగించి, మిగిలిన వారికోసం వెతుకుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.