కోహ్లీసేనకే గెలుపు అవకాశాలు ఎక్కువ : అజయ్ జడేజా

SMTV Desk 2018-01-05 12:01:24  ajay jadeja, frredom series, india, south africa, 1 st test

కేప్‌టౌన్, జనవరి 4 : ఇండియా- సౌతాఫ్రికాల మధ్య ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ ఈ రోజు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మరికొద్ది క్షణాల్లో ఇరు జట్లు పోరులో తలపడనున్నాయి. ఈ సందర్భంగా భారత్ మాజీ ఆటగాడు అజయ్ జడేజా మాట్లాడుతూ.." సఫారీలను వారి సొంతగడ్డపై ఓడించడం ఏ జట్టుకైనా కష్టమే. కానీ ప్రస్తుత టీమిండియా చాలా బలంగా ఉంది. ఈ రోజు కేప్‌టౌన్ లో జరిగే తొలి మ్యాచ్ లో కోహ్లి సేనకే విజయావకాశాలు ఎక్కువ. ఎందుకంటే అక్కడి పిచ్, వాతావరణం మనకు అనుకూలిస్తాయి. ఏ సిరీస్ లోనైనా తొలి గెలుపే కీలకం." అని వ్యాఖ్యానించారు.