న్యూఢిల్లీ, జనవరి 4 : ఆమ్ ఆద్మీ పార్టీ.. 18 మంది వ్యక్తులకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసిందట. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సహా మాజీ చీఫ్ జస్టిస్ టీఎస్.ఠాకూర్, ఆరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హాతో పాటు పలువురు కార్యకర్తలకు రాజ్యసభ సీటు ఇస్తామని ప్రకటించింది. కాని అందులో కొంతమంది బహిరంగంగానే తిరస్కరించగా, మరికొంతమంది రాజ్యసభలో ఎక్కడ తమను టార్గెట్ చేస్తారోనన్న భయ౦తో వదులుకున్నారట. ఈ విషయాలను స్వయంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. ఆప్ పరిశీలించిన జాబితాలో దిలీప్ పాండే, దీపక్ వాజ్పేయ్, అశుతోష్, రాఘవ్ చద్దా, పంకజ్ గుప్తా పేర్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా కుమార్ విశ్వాస్కు రాజ్యసభలో సీటు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.