న్యూఢిల్లీ, జనవరి 4 : భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యహూ ఓ ఉపయోగకరమైన బహుమతిని ఇవ్వబోతున్నారట. ఈ నెల 14 నుంచి నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటనకు విచ్చేస్తున్న ప్రధాని బెంజిమిన్ ఆ బహుమతిని తీసుకురావడం జరుగుతుంది. అయితే, గతేడాది జులైలో మోదీ ఇజ్రాయెల్లో పర్యటించారు. ఆ సందర్భంలో ఇరు దేశాల ప్రధానులు ఓల్గా బీచ్లో కాసేపు సేద తీరారు. అనంతరం అక్కడి అధికారులు ఈ గాల్-మొబైల్ వాటర్ ప్యూరిఫైర్ వాహనం గురించి మోదీకి వివరించారు. ఈ వాహనంలో మోదీ, నెతన్యహూ కాసేపు ప్రయాణించారు కూడా జరిగింది. ఈ మేరకు మోదీ కోసం ఆ జీపును తీసుకొస్తున్నట్లు ఇజ్రాయెల్ వర్గాలు పేర్కొన్నాయి. దీని ధర 3,90,000 షెకెల్స్(ఇజ్రాయెల్ కరెన్సీ పేరు) ఉంటుందట. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.70లక్షలు ఉంటుందట. వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తాగునీటి కోసం ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది రోజుకు 20వేల లీటర్ల సముద్రపు నీటిని తాగునీరుగా శుద్ధి చేస్తుంది.