రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా మారుద్దాం : చంద్రబాబు

SMTV Desk 2018-01-04 16:23:15  janmabhoomi- maa ooru, chandra babunaidu, icchapuram, srikakulam

శ్రీకాకుళం, జనవరి 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక౦గా చేపట్టిన ఐదో విడత ‘జన్మ భూమి- మా ఊరు’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు జిల్లాలోని ఇచ్చాపురం విచ్చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో బహిరంగ సభావేదికలో ఆయన మాట్లాడుతూ.. "రాష్ట్ర విభజన వల్ల అనేక కష్టాలు అనుభవించాం. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు వచ్చిన ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ప్రభుత్వ పధకాలు కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన రావాలి. రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు అందరూ కృషీ చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు కోసం రూ.15వేలు ఇస్తున్నాం. మార్చి 31లోగా ప్రతీ ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి. పలు చోట్ల ‘చెంబు శవయాత్ర’ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో ప్రతీ కుటుంబానికి మరుగుదొడ్డి ఉండాలని దీనిపై జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశా౦. అవసరమైతే ఒక రోజుల్లా నిరాహార దీక్ష చేసి సమస్య పరిష్కారానికి కలెక్టర్లపై పోరాటం చేస్తాను" అని వ్యాఖ్యానించారు.