ప్రజల సమస్యలు తీర్చడానికే ఈ జన్మభూమి :మంత్రి లోకేశ్

SMTV Desk 2018-01-04 15:12:19  minister naralokesh gutur janmabhumi

గుంటూరు, జనవరి 4 : నేడు గుంటూరు జిల్లాలోని కొల్లిపర మండలం అత్తోటలో జన్మభూమి- మా ఊరు మూడవ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్, పుల్లారావు, ఆనందబాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజా, రాయపాటి రంగబాబు, శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ...ప్రతిగ్రామానికి 10 స్టార్ పాయింట్లు కేటాయిస్తున్నామని, మౌలిక సదుపాయాల ఆధారంగా రేటింగ్‌లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఈ జన్మభూమి కార్యక్రమం చేపట్టామని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా అధికారులే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తారన్నరని, ఆయన వెల్లడించారు.