లాలూ శిక్ష మళ్లీ రేపటికి వాయిదా..

SMTV Desk 2018-01-04 15:00:00  rjd, fodder scam, jail sentence, tomorrow, ranchi cbi court

రాంచీ, జనవరి 4 : ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు పశు దాణా కుంభకోణం కేసులో శిక్షను రాంచీ ప్రత్యేక కోర్టు రేపటికి వాయిదా వేసింది. గత డిసెంబరు 23న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూతో పాటు మరో 15 మందిని దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేసు పై శిక్షను జనవర్ 3న ప్రకటిస్తామని న్యాయస్థానం చెప్పిన, న్యాయవాది విందేశ్వర ప్రసాద్‌ మృతి చెందడంతో తీర్పును ఈ రోజుకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. కాగా మళ్లీ ఇప్పుడు రేపటికి వాయిదా వేసినట్లు న్యాయస్థానం తెలిపింది.