ఇసుక మాఫియా చేతిలో వీఆర్‌ఏ హతం...

SMTV Desk 2018-01-04 14:39:06  Sand mafia, KAMAREDDY, Nizam Sagar

నిజాం సాగర్, జనవరి 4: కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. పెట్ల మండలం కంబాపూర్ వద్ద కాకివాగు నుంచి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న గ్రామ రెవెన్యు సహాయకుడిని కిరాతకంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి ఇసుక రవాణాదారులు ట్రాక్టర్ల మీద ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారంతో వీఆర్‌ఏ సాయిలు( 4 0) అక్కడికి వెళ్లి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో ట్రాకర్టర్ల డ్రైవర్లు సాయిలును ఢీకొట్టి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడ్డ సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు.