కేప్ టౌన్, జనవరి 4 : భారత్ క్రికెట్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కేప్ టౌన్ లో సాధన చేస్తున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా నెట్సలో శ్రమ పడుతున్న కోహ్లీ సేన రేపు జరగ బోయే కేప్ టౌన్ వేదికగా జరగబోయే తొలి టెస్టుకు సిద్ధమవుతుంది. పర్యటనలో భాగంగా ఆతిధ్య సౌతాఫ్రికా మన త్రివర్ణ పతకాన్ని అవమానపరిచింది. కేప్టౌన్లో మన దేశపు జెండాను స్టేడియం నిర్వాహకులు తిరగేసి ఎగురవేశారు. సాధారణంగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఏవైనా పోటీలు జరుగుతుంటే ఆతిథ్యం ఇస్తున్న దేశంతో పాటు ఆ టోర్నీలో పాల్గొన్న ఆయా దేశాల జాతీయ జెండాలు రెపరెపలాడుతూ కనిపిస్తుంటాయి. ఇందులో భాగంగా మన దేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత ఎవరో వచ్చి భారత పతాకాన్ని తప్పుగా ఉంచినట్లు గుర్తించి మైదానం సిబ్బందికి సూచించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది తమ తప్పును సరిదిద్దుకున్నారు. ఇప్పుడు దానికి సంబధించిన ఫోటోలు అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్నాయి.