సామాన్య వ్యక్తిగా రక్షణ మంత్రి...

SMTV Desk 2018-01-04 12:48:03  Minister of Defense nirmalasitharaman, Bangalore tour with out Security staff

బెంగళూరు, జనవరి 4 : దేశ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బెంగుళూరులో పర్యటించారు. అయితే, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఆమె పర్యటనను ముగించుకున్నారు. దేశ నలుములాలలో మంత్రులు ఎక్కడికి వెళ్లితే, అక్కడ వారికి భద్రత సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి దేశ రక్షణ మంత్రైన నిర్మలా సీతారామన్ కు భద్రత చాలా ముఖ్యం కానీ, ఆమె మాత్రం ఎలాంటి భద్రత లేకుండా ఓ సమావేశం ముగించుకొని మధ్యాహ్నం సమయంలో ఎస్పీ ఆఫీసు నుంచి నడుచుకుంటూ వెళ్లి, ఎదురుగా ఉన్న హోటల్‌లో భోజనం చేశారు. ఆ సమయంలో ఆమె వెంట కొంతమంది అధికారులు, సామాన్యులు తప్ప ఎలాంటి భద్రతా సిబ్బంది లేరు. అత్యంత కీలకమైన పదవిలో ఉన్న ఆమె ఎలాంటి హడావుడి లేకుండా సామాన్య వ్యక్తిగా వీధిలో నడిచి అందర్ని ఆశ్చర్యపర్చారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మధ్యమాల్లో వైరల్‌ అయింది.