లక్నో, జనవరి 4 : ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై స్మాషర్స్ జట్టుకు ఢిల్లీ డాషర్స్ షాకిచ్చింది. ఢిల్లీ డాషర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై స్మాషర్స్ 0–3తో ఓడింది. డబుల్స్లో చెన్నైకి చెందిన సుమిత్ జోడీ మినహా కెప్టెన్ పీవీ సింధు సహా మిగతా షట్లర్లంతా తమ మ్యాచ్ల లో ఓటమి చవి చూశారు. మహిళల సింగిల్స్లో ఢిల్లీ స్టార్ సంగ్ జీ హ్యూన్ సింధును చిత్తుచేసింది. పురుషుల డబుల్స్లో చెన్నై జోడీ, ఢిల్లీ జంటపై గెలిచినా ‘ట్రంప్’ మ్యాచ్లో ఓడటంతో చెన్నై పాయింట్ ని కోల్పోయింది.