ముంబాయి, జనవరి 4: ఇటీవల ముంబయిలోని కమలా మిల్స్ సముదాయంలో భారీ అగ్నిప్రమాదాన్ని మరువక ముందే గురువారం అంధేరీ ప్రాంతంలోని ఓ భవనంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఏ విధంగా సంభవించిందో తెలియాల్సి ఉంది.