బీజింగ్, జూన్ 19 : పారిస్ నుంచి చైనా వెళ్తున్న ఓ విమానం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఒక్కసారిగా అదుపు తప్పడంతో ఈ ఘటనలో 26 మంది ప్రయాణికులు గాయపడ్డారు. చైనా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. పారిస్లోని ఛార్లెస్ డీ గాల్లీ ఎయిర్పోర్టు నుంచి చైనాలోని కున్మింగ్ చాంగ్షుయ్ విమానాశ్రయానికి వెళ్తున్న చైనా ఈస్ట్రన్ ఎయిర్లైన్స్ విమానం ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో విమానం లోపల లాకర్లలోని లగేజీ కింద పడింది. సీట్లలోని ప్రయాణికులు కూడా కిందపడిపోయారు. ఈ ఘటనలో 26 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు 10 నిమిషాల పాటు విమానంలో అలజడి నెలకొందని ఓ ప్రయాణికుడు చెప్పారు. రెండు సార్లు బలంగా.. మూడు సార్లు స్వల్పంగా విమానం కుదిపేసిందని తెలిపారు. ఘటనపై చైనా ఎయిర్లైన్స్ స్పందించింది. ప్రయాణికులకు వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపింది.