ఈ నెల 7న విజయవాడలో నిర్వహించనున్న అమరావతి మారథాన్‌...

SMTV Desk 2018-01-03 13:17:12  Amravati marathon in vijayawada on 7th, commissioner goutham savang

విజయవాడ, జనవరి 03 : విజయవాడలో ఈ నెల 7న జరిగే అమరావతి మారథాన్‌ కు ముమ్మార ఏర్పాట్లు చేస్తున్నామని, నగర పోలీసు కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం గౌతమ్ సవాంగ్ మారథాన్‌ టీ షార్ట్ ను ఆవిష్కరించి, మీడియాతో మాట్లాడారు. దీప్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఆదివారం ఉదయం 6 గంటలకు మారథాన్‌ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. హాఫ్‌ మారథాన్‌, 10కే, 5కే ఫన్‌ రన్‌లు విభాగాల్లో పరుగు నిర్వహిస్తారు. కాగా, యువత విద్యార్ధులు కూడా ఈ మారథాన్ లో చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.