లాలూ ‘దాణా’ శిక్ష రేపటికి వాయిదా

SMTV Desk 2018-01-03 12:59:16  lalu prasad yadav, fodder scam, jail sentence, bihar

రాంచీ, జనవరి 3 : బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు పశు దాణా కుంభకోణం కేసులో శిక్షను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. గత డిసెంబరు 23న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూతో పాటు మరో 15 మందిని దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరికి ఈ రోజు శిక్ష ఖరారు చేయనున్నట్లు ఇంతకుముందు న్యాయస్థానం వెల్లడించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం బిర్సాముండా కారాగారం నుంచి ప్రత్యేక భద్రత నడుమ లాలూను న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే న్యాయవాది విందేశ్వర ప్రసాద్‌ మృతి చెందడంతో తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.