హైదరాబాద్, జనవరి 02 : కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల వల్లే రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు సరఫరా సాధ్యమవుతుందని, రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తప్పుపట్టిన రేవంత్, విభజన సమయంలో విద్యుత్ కష్టాలు రాకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకుందన్నారు. ఆస్తులు, అప్పులు, జనాభా ప్రాతిపదికన పంపకాలు జరుగగా, విద్యుత్ మాత్రం వినియోగం ఆధారంగా కేటాయించారని ఆయన తెలిపారు. 42% జనాభాకు 56% కేటాయింపులు జరుపడంతో పాటు కాంగ్రెస్ హయంలో చేపట్టిన కొత్త విద్యుత్ ప్రాజెక్టుల వల్లే ఈ సరఫరా మెరుగుపడిందని అన్నారు. సాగుకు 24 గంటల విద్యుత్తును రైతులు కోరాకపోయిన, తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేస్తుందని రేవంత్ విమర్శలు గుప్పించారు.