పోలీసులకు చిక్కిన ఎర్రచందనం స్మగ్లర్లు

SMTV Desk 2018-01-02 15:33:50  The red-smuggling smugglers in nellore

నెల్లూరు, జనవరి 02 : అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్లను నెల్లూరు జిల్లా పోలీసులు చేజిక్కించుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...జిల్లాలోని మూడు మండలాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన పోలీసులు 14 మందిని అరెస్టు చేసి, రూ.55 లక్షల విలువైన 33 ఎర్రచందనాలను దుండగుల నుంచి స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. అయితే, ఉదయగిరి, రాపూరు, సోమశిల ప్రాంతాల్లో ఎర్రచందనం రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. వీరిలో అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటూ, స్థానిక స్మగ్లర్లు, కూలీలు, బ్లోకర్లు ఉన్నట్లు ఓఎస్డీ విఠలేశ్వర్‌ వెల్లడించారు.