రంజీ ట్రోఫీ విజేత..విదర్భ

SMTV Desk 2018-01-02 11:08:59  ranji trophy, league vidarbha, delhi, gurbhani,

ఇండోర్, జనవరి 2 : దేశవాళీ రంజీ ట్రోఫీలో తొలిసారిగా విదర్భ జట్టు అందరి అంచనాలును తలకిందులు చేస్తూ విజేతగా నిలిచింది. అనామక జట్టుగా బరిలోకి దిగిన విదర్భ కసితో ఆడి రంజీ ఫైనల్లో 9 వికెట్ల తేడాతో ఢిల్లీపై ఘనవిజయం సాధించి, తొలి సారి ఛాంపియన్‌ గా అవతరించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 295 పరుగులకు ఆలౌట్‌కాగా, తర్వాత బ్యాటింగ్ కు దిగిన విదర్భ 547 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఢిల్లీ 280 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో విదర్భ జట్టు సునాయాసంగా 29 పరుగుల చేసి లక్ష్యాన్ని చేధించింది. ఆరు వికెట్లతో తొలి ఇన్నింగ్స్‌లో దిల్లీ పతనాన్ని శాసించిన గుర్బాని ‘‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’’ అవార్డును గెలుచుకున్నాడు. ఈ విజయంతో రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న 18వ జట్టుగా విదర్భ నిలిచింది.