న్యూఢిల్లీ, జనవరి 1 : రియో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ ఆటలో పురోగతి సాధించేందుకే ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్) ఆడుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం మారిన్ పీబీఎల్ టోర్నీ తరపున హైదరాబాద్ హంటర్స్కు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మారిన్ మాట్లాడుతూ.." పీబీఎల్లో ఆడటం, అందులోనూ హైదరాబాద్ హంటర్స్ తరపున బరిలోకి దిగడం నాకు ప్రత్యేకం. నా వరకు ఈ టోర్నీ ఎంతో ముఖ్యమైనది. నా ఆటతీరు మెరుగు పరుచుకునేందుకే పీబీఎల్ ఆడుతున్నాను. ఈ టోర్నీలో అగ్రశ్రేణి క్రీడాకారులతో తలపడే అవకాశం వస్తుంది. ప్రస్తుతం నా లక్ష్యం ఆల్ఇంగ్లాండ్ ఓపెన్, ప్రపంచ ఛాంపియన్షిప్తో పాటు సూపర్ సిరీస్ టోర్నీలలో విజయం సాధించడం” అని వ్యాఖ్యానించారు.