హైదరాబాద్, జనవరి 1 : "24గంటల పాటు ఉచిత విద్యుత్ అనేది తెలంగాణ సాధించిన అద్భుత విజయ౦" అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ ను అంది౦చే ఘనత విద్యుత్ సంస్థల ఉద్యోగులకే దక్కుతుందన్నారు. నూతన సంవత్సర౦ సందర్భంగా నేటి నుండి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఆయన ట్రాన్స్కో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ముందుగా ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావును అభినందిస్తూ రాష్ట్రంలోని రైతులతో పాటు అన్ని వర్గాల వారికి నూతన సంవత్సర ఆనందాన్ని రెట్టింపు చేశారని కితాబిచ్చారు.