న్యూఢిల్లీ, జనవరి 1 : భారత్- పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ అంటేనే క్రికెట్ అభిమానుల్లో ఎక్కడ లేని ఆసక్తి నెలకొ౦టుంది. కాగా టీమిండియాతో, పాకిస్థాన్ ఎప్పటినుండో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ కోసం ప్రయత్నిస్తుంది. కానీ వారికి అది అందని ద్రాక్షగానే మిగిలింది. తాజాగా ఈ విషయం పై భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.."దాయాది పాకిస్తాన్ తో ఎట్టిపరిస్థితుల్లో భారత్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడదు. సరిహద్దుల్లో పాకిస్థాన్ ఇటీవల పదేపదే కాల్పులకు తెగబడుతుంది. అంతే కాకుండా కుల్భూషణ్ జాదవ్ కుటుంబంతో పాక్ కనబరిచిన వ్యవహారం సరైనది కాదు” అని తెలిపారు.