ముంబై, జనవరి 1 : ముంబైలో ఇటీవల కమలా మిల్స్లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ భవన౦లోని వన్ ఎబో పబ్లో పనిచేస్తున్న ఇద్దరు మేనేజర్లు అరెస్ట్ అయ్యారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టిన పోలీసులు ముందుగా ఆ అగ్ని ప్రమాదం నుండి బయటపడిన వారిని విచారించారు. మొదట వన్ ఎబో రెస్టారెంట్లోనే మంటలు అంటుకున్నట్లు వారు చెబుతున్నారు. అందుకే వారిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఈ ఆరోపణలను పబ్ మేనేజ్మెంట్ తోసిపుచ్చింది. మొదట మంటలు ఇక్కడ వ్యాపించలేదని, పక్కనే ఉన్న మోజోస్ బిస్ట్రో పబ్ నుంచే మంటలు వ్యాపించాయని తెలిపారు. ఆ మేనేజ్మెంట్కు ఉన్న పలుకుబడి వల్ల నేరాన్ని తమపై నెట్టేశారని ఆరోపి౦చింది. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ముంబయి పోలీసు కమిషనర్కు ఈ విషయమై ఓ లేఖ రాసినట్లు పేర్కొన్నారు.