హైదరాబాద్, జనవరి 1 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పార్టీ సభ్యత్వ నమోదును అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్లోని జనసేన కార్యాలయంలో పార్టీ మొదటి స్వభ్యత్వాన్ని ఆయన తీసుకొని ఆ పార్టీలోని ప్రముఖులకు నమోదు పత్రాలను అందజేశారు. రానున్న రోజుల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పార్టీ మూడు రోజులుగా చేపట్టిన చర్చలలో పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను తెలిపి.. త్వరలోనే నిర్వహించనున్న శిక్షణ శిబిరాల గురించి చర్చించారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదుకై రూపొందించిన సాఫ్ట్వేర్ పనితీరు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.