శ్రీనగర్, డిసెంబర్ 31 : జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంపై ఉగ్రదాడి జరిగింది. భద్రతా బలగాలపై పాక్ జైషే-ఈ-మహ్మద్ ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడులను సీఆర్పీఎఫ్ బలగాలు తిప్పి కొట్టాయి. కాని ఇరువురికి జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందగా, ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. శిక్షణా శిబిరం నుంచి మరో ఆరుగురు జవాన్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ నేపథ్యంలో గాయపడిన జవాన్లను దగ్గర లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.