కర్ణాటకలో పాగా వేసేందుకు కమలం కొత్త వ్యూహం..!

SMTV Desk 2017-12-31 14:27:51  bjp, jds, 2018 assembly elections, congress

కర్ణాటక, డిసెంబర్ 31 : కేంద్ర ప్రభుత్వంలో అధికార చక్రం తిప్పుతున్న ఎన్డీయే సర్కార్ ఇటీవల వెలువడిన గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాల్లో విజయ భేరి మోగించి దేశంలో 19 రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మిగిలిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీజెపీ పాగా వేయాలని భావిస్తుంది. కాగా కొన్ని నెలల్లో కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, జేడీఎస్ ల మధ్య పొత్తు పొడిచేందుకు అవకాశమున్నట్లు సమాచారం. అందుకు తగ్గ విధంగా జేడీఎస్‌ వర్గాలు ప్రధాని మోదీని ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శించరాదని నిశ్చయించుకోగా, బీజేపీ సైతం మాజీ ప్రధాని దేవెగౌడ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి పట్ల ఆరోపణలు చేయరాదని పార్టీ వర్గాలకు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.