మానసిక వ్యాధులు పెరిగిపోతున్నాయి : రాష్ట్రపతి

SMTV Desk 2017-12-31 13:36:17  President, ramnath kovindh, comments on Mental diseases

న్యూఢిల్లీ, డిసెంబర్ 31 : దేశంలో సాంకేతికత పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో మానసిక వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ విషయంపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ మాట్లాడుతూ.. దేశంలో మానసిక వ్యాధులు నానాటికి పెరిగిపోతున్నాయి. ఆర్ధిక, సాంకేతికత పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్న కారణంగా అనేక సమస్యలతో పాటు.. మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. రానున్న 2022 వ సంవత్సరంలో దేశం 75 వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో మనో వ్యాధిగ్రస్తుల వ్యాధి నిర్ధారణతో పాటు చికిత్స సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ పేర్కొన్నారు.