చెన్నై, డిసెంబర్ 31 : సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచే బీజెపీ రాజ్యసభ సుబ్రమణ్య స్వామి రజనీ కాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై తీవ్రంగా మండిపడ్డారు. తలైవా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 234 సీట్లలో పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సుబ్రమణ్య స్వామి ఓ జాతీయ ఛానెల్ కు ప్రతినిధులతో మాట్లాడుతూ.."నటులు రాజకీయాల్లోకి రావడం తమిళనాడులో కొత్తేమీ కాదు. తొలి నుండి నేను రజినీకాంత్ను వ్యతిరేకిస్తూనే ఉన్నాను. ఇప్పటికీ అతని పార్టీ ఏంటో ప్రకటించలేదు. రాజకీయాల్లోకి వస్తానని మాత్రమే చెప్పాడు. అంతకు మించి వేరే ఏ వివరాలు చెప్పలేకపోయాడు. అతనో నిరక్షరాస్యుడు. రజినీకాంత్ విషయంలో మీడియా హడావుడి తప్ప మరేమీ లేదు" అని వ్యాఖ్యానించారు. గతంలో కూడా స్వామి రజనీకాంత్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ రాజకీయాలకు సరిపోడని. రాజకీయాల్లో ఎలా మెలగాలన్న తెలివి తలైవాకు లేదని. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వస్తే మాత్రం కఠిన పరిస్ధితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చిరించారు.