దేవుడు శాసించాడు.. తలైవా రాజకీయాల్లోకి వస్తున్నాడు...

SMTV Desk 2017-12-31 11:56:00  rajni kanth, political party, tamilanadu, superstar

చెన్నై, డిసెంబర్ 31 : తమిళనాడు రాజకీయం రంగంలో మరో కొత్త పార్టీ అవతరించనుంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ గత కొన్నేళ్లుగా తన రాజకీయ కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించారు. గత ఆరు రోజులుగా అభిమానులతో సమావేశం అవుతున్న తలైవా తన రాజకీయ అరంగేట్రంపై డిసెంబరు 31 న స్పష్టత ఇస్తానని ప్రకటించిన విషయం విధితమే. ఆ రోజు కోసం ఆశగా ఎదురుచూస్తోన్న అభిమానులకు రజనీకాంత్ సంతోషం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని 234 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తలైవా మాట్లాడుతూ.." ప్రస్తుతం ప్రజలను పాలిస్తున్న పార్టీలు నిలువునా దోచుకుంటున్నాయి. నేను స్థాపించే పార్టీ, సత్యం, పని, అభివృద్ధి, అనే మంత్రాలతో ముందుకెళ్తుంది. నేను రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మూడు సంవత్సరాలలో రాజీనామా చేస్తాను. గెలుపు, ఓటమి భగవంతుడి చేతిలోనే ఉంది. దేవుడి అండ, ప్రజల ఆశీస్సులతో ఆధ్యాత్మిక పాలన అందిస్తాను. నాకు రాజకీయాలు అంటే భయం లేదు. కానీ మీడియా అంటే భయపడతాను" అని వ్యాఖ్యానించారు.