ఆటో, కారు ఢీ.. ముగ్గురు మృతి..

SMTV Desk 2017-12-30 15:22:42  road accident, krishna district, mailavaram

కృష్ణ, డిసెంబర్ 30: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జల్లా మైలవరం రహదారిపై వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టి౦ది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.