రెవెన్యూ శాఖలో కొలిక్కి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ల విభజన ప్రక్రియ

SMTV Desk 2017-12-30 14:30:12  DEPUTY COLLECTOR POSTS, AP, TELANGANA, CENTRAL GOVERNMENT.

అమరావతి, డిసెంబరు 30 : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ల విభజన ప్రక్రియను కేంద్రం పూర్తిచేసింది. మొత్తం 536 ఖాళీలు ఉన్న పోస్టులలో ఏపీకి 322, తెలంగాణకు 214 మంది డిప్యూటీ కలెక్టర్లకు కేటాయిస్తూ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, శిక్షణ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో డిప్యూటీ కలెక్టర్లతో పాటు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు కూడా ఉన్నారు. దీంతో మొదటి విడత నియామకం పూర్తయింది. రెండో విడతగా ఏ రాష్ట్రానికి చెందకుండా ఉన్న వారు, సీనియారిటీ జాబితాలో లేని వారిని కేటాయించనున్నారు. ఇదిలా ఉండగా తాత్కాలిక కేటాయింపులను సవాల్‌ చేస్తూ కోర్టు నుంచి స్టే ఉత్తర్వులు పొందిన వారికి ఈ విభజన ఉత్తర్వులు వర్తించవు. ఆయా కేసులు తేలిన తర్వాతే కోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా విభజన చేయనున్నారు.