కోహ్లీకి సఫారీ పర్యటన కఠిన పరీక్ష : బిషన్‌ సింగ్‌ బేడి

SMTV Desk 2017-12-30 11:56:25  bishan singh bedi, kohli, p.v.sindhu, india, south africa

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ప్రస్తుతం భారత్ క్రికెట్ అభిమానుల దృష్టి అంతా దక్షిణాఫ్రికా టూర్ పై నెలకొంది. ఇప్పటికే టీమిండియా జట్టు టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికాలో అడుగుపెట్టింది. కాగా ఈ పర్యటన కోహ్లి సేనకు కఠిన పరీక్ష అని భారత్ మాజీ దిగ్గజ స్పిన్నర్ బిషన్‌ సింగ్‌ బేడి అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. "కోహ్లీ కెప్టెన్ గా స్వదేశంలో ఎన్నో విజయాలను సాధించాడు. కానీ ప్రస్తుత సఫారీ పర్యటన అతని నాయకత్వానికి పెను సవాల్ గా మారనుంది. బ్యాడ్మింటన్ లో తెలుగు తేజం పీ.వీ. సింధు ప్రపంచ దిగ్గజాలకు గట్టి పోటీ ఇచ్చి తన సత్తా చాటింది. సింధులా తన సామర్థ్యం నిరూపించుకోవడానికి కోహ్లికి కొన్ని ఇబ్బందులు తప్పవు" అని తెలిపారు.