హైదరాబాద్, డిసెంబర్ 30 : రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాత్రి సమయాల్లో సాధారణం కంటే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్లో 3.6 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదవ్వగా, భద్రాచలంలో 8 డిగ్రీలు, ఖమ్మంలో 7డిగ్రీలు, మెదక్లో 6డిగ్రీలు, రామగుండంలో 5డిగ్రీలు, హైదరాబాద్లలో 3 డిగ్రీల మేర సాధారణం కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంతోపాటు ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ సహా పలు జిల్లాలో అతి శీతల గాలులు వీస్తున్నాయి. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.