కేప్టౌన్, డిసెంబర్ 29 : భారత్- సౌతాఫ్రికా మధ్య మూడు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా జనవరి 5వ తేది నుండి తొలి మ్యాచ్ కేప్టౌన్ వేదికగా జరగనుంది. కాగా ఈ మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు టీమిండియా జట్టుతో పోరాడే సఫారీ టీంను ప్రకటించింది. ఈ జట్టుకు డుప్లెసిస్ సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో గాయం, ఇన్ ఫెక్షన్ నుండి కోలుకున్న డీకాక్, స్టెయిన్ కూడా చోటు దక్కించుకొన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది జూన్ లో ఇంగ్లాండ్ మ్యాచ్ తర్వాత గాయం కారణంగా ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడని క్రిస్ మోరిస్ కూడా జట్టులో స్థానం సంపాదించుకొన్నాడు. సౌతాఫ్రికా జట్టు: డుప్లెసిస్(సారథి), డికాక్(వికెట్ కీపర్), హషీమ్ ఆమ్లా, బవుమా, డివిలియర్స్, డి బ్రూన్, ఎల్గర్, కేశవ్ మహారాజ్, మర్ర్కమ్, మోర్కెల్, క్రిస్ మోరిస్, అండిలే పెహ్లుక్వాయో, ఫిలాండర్, రబాడ, డేల్ స్టెయిన్.