ఆలస్యంగా నిద్ర లేచిందన్న కోపంతో...

SMTV Desk 2017-12-29 18:24:53  triple talaq, UP INCIDENT, CENTRAL GOVERNMENT. BILL ISSUED.

ఉత్తరప్రదేశ్, డిసెంబర్ 29 : ఒకవైపు ట్రిపుల్ తలాక్ విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడి వేడి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. ఒక చిన్న కారణానికే వివాహ బంధానికి తలాక్ తో స్వస్తి పలికిన ఓ ప్రబుద్దుడి ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యూపీ రాంపూర్‌ జిల్లాలోని అజీంనగర్‌లో.. ఖాసీం అనే వ్యక్తికి గుల్‌ ఆష్ఫాన్‌ అనే మహిళతో ఆరు నెలల క్రితం వివాహమైంది. కాగా ఆమె ఆలస్యంగా నిద్రలేచిందనే కోపంతో ఖాసీం రెచ్చిపోయాడు. ఆమెను తీవ్రంగా హింసించి ఇంట్లో బంధించాడు. అనంతరం మూడు సార్లు తలాక్ చెప్పి ఇంట్లో నుండి పారిపోయాడు. ఈ క్రమంలో ఆమె తన భర్తపై ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేయలేకపోయారు. ఈ ఘటన తలాక్‌కు వ్యతిరేకంగా కేంద్రం బిల్లు ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు జరగడం గమనార్హం.