టెక్కలి, జూన్ 18 : శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్ మోహన్ నాయుడు వివాహ విందు కార్యక్రమం వైభవంగా జరిగింది. కోటబొమ్మాలి మండలంలోని ఆయన స్వగ్రామంలో గల భవానీ గ్రానైట్స్ సమీపంలో కింజరాపు ఎర్రన్నాయుడు ప్రాంగణంలో విందు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణ. జిల్లా నలుమూలల నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు, కింజరాపు కుటుంబ అభిమానులతో పాటు వివిధ పార్టీల నాయకులు, అధికారులు విందుకు తరలి వచ్చారు. జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి, ఎస్పీ బ్రహ్మారెడ్డి, ఎమ్మెల్యేలు గౌతు శ్యాం సుందర శివాజీ, బి.అశోక్, బి.రమణమూర్తి, కె.వెంకటరమణ, గుండ లక్ష్మీదేవి తదితరులు హాజరయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకుంది. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.