ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన జంపన్న!

SMTV Desk 2017-12-29 17:26:03  Jinugu Narasinhareddy alias japanna, Maoist party cheater japanna, Party spokesperson Abhay

హైదరాబాద్, డిసెంబర్ 29 : ఇటీవల జనజీవ స్రవంతిలో కలిసిన మావోయిస్టు జినుగు నరసింహారెడ్డి అలియాస్‌ జంపన్నను మావోయిస్టు పార్టీ ద్రోహిగా ఆరోపించింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో నాలుగు పేజీల పత్రికా ప్రకటన విడుదలైంది. అందులో అభయ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పార్టీ సమాచారాన్ని పోలీసులకు లీక్‌ చేసి, సిద్ధాంతం పేరుతో మావోయిస్టు పార్టీని నాశనం చేసే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. అందుకని ముందస్తు సమాచారంతో, ఏడాది క్రితమే పార్టీ రెండేళ్లపాటు సస్పెండ్‌ చేసింది. తాను లొంగిపోవడానికి మావోయిస్టు పార్టీతో సైద్ధాంతిక విభేదాలే కారణమని చెప్పుకోవడం విడ్డూరం. జంపన్న మావోయిస్టు పార్టీ ద్రోహిగా మిగిలిపోయాడు. అంతేకాకుండా జంపన్న 33 ఏళ్ల ఉద్యమాన్ని తాకట్టు పెట్టడంపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రజలే గుణపాఠం చెబుతారంటూ, ఒక ప్రకటనలో తెలియజేశారు.