అవినీతి సొమ్ముకు ఆశపడి ఏసీబీ వలలో చిక్కిన అటెండర్‌

SMTV Desk 2017-12-29 15:13:11  Attender in the ACB srinivas kumar vijayawada

విజయవాడ, డిసెంబర్ 29 : అటెండర్‌ ఉద్యోగం చేస్తూ, అవినీతి సొమ్ముకు ఆశపడిన విజయవాడకు చెందిన శ్రీనివాస కుమార్‌ ఇంట్లో నిన్న ఐటీ సోదాలు నిర్వహించారు. 27 ఏళ్లుగా ఎక్కడ బదిలీ కాకుండా విజయవాడలో ఉంటూ, మరో అక్రమ సొమ్ముతో, త్వరలో ప్రిన్సిపాల్‌ కూడా అయ్యేవారు. కానీ ఇంతలో ఏసీబీ అధికారులు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ విజయవాడలో ఏకకాలంలో ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసి, ఆయనకు రూ.25 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు. తండ్రి నుంచి "వారసత్వం"గా ఉద్యోగం పొందిన శ్రీనివాస్ తల్లిని వృద్ధాశ్రమానికి తరలించేశాడు. అంతేకాకుండా రెండు నెలలుగా అటు వైపు వెళ్లకపోగా, వృద్ధాశ్రమానికి కట్టాల్సిన డబ్బును కూడా కట్టలేదు. దీంతో తల్లి వచ్చే పెన్షన్‌ నుంచి ఆ డబ్బును చెల్లించింది. కాగా, మీడియా ద్వారా కొడుకు నిర్వాకం తెలిసి ఆమె ఆవేదనకు గురైంది.