అమరావతి, డిసెంబర్ 29 : ఏపీలో జనవరి 22 వ తేదీ నుండి ఫిబ్రవరి 20 వరకు గ్రూప్-1(2011) సర్వీసు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. సింగల్ బోర్డు ద్వారా ఈ ఇంటర్వ్యూలు జరగనుండగా మొత్తం రెండు సెషన్లుగా నిర్వహిస్తారు. మెయిన్స్ రాత పరీక్షలో మొత్తం 152 పోస్టులకు మెరిట్ ప్రాతిపదికగా ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేశారు. కాగా రోజుకు 15 మంది చొప్పున ఇంటర్వ్యూలను ఉదయం 8 గంటలకు ప్రారంభించనున్నారు. 8 గంటలకు మొదటి సెషన్, 11 గంటలకు రెండవ సెషన్ గా నిర్వహించనున్నారు. ఎం.జీ.రోడ్డు(బందరు రోడ్డు)లోని ఆర్అండ్బీ భవనం రెండో ఫ్లోర్లో ఏపీపీఎస్సీ ప్రాంగణంలో ఈ గ్రూప్ 1 ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇంటర్వ్యూకు సంబంధించి మిగతా వివరాలకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ www.psc.ap.gov.in లో చూడవచ్చన్నారు