విజయవాడ, డిసెంబర్ 29 : డిసెంబర్ 31 వస్తుందంటే చాలు స్కూల్ విద్యార్థుల నుండి ఉద్యోగం చేసే యువత వరకు అందరు సమాయత్తమవుతారు. ఎక్కడ పార్టీ చేసుకోవాలి, ఎవరెవ్వరు చేసుకుందాం అంటూ దాదాపు ఫోన్లలోనే వేడుకను ఫిక్స్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలకు అడ్డు కట్ట వేస్తూ విజయవాడ డీసీపీలు కాంతిరాణా, గుజరావ్ భూపాల్ రావులు రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆసుపత్రుల సమీపంలో వేడుకలు నిర్వహించకూడదని, కోడిపందేలు, పేకాటను నిర్వహించేవారి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హైస్పీడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని, నగరంలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని, వేడుకలను నిర్వహించేవారు అనుమతి తీసుకోవాలని పోలీసుల వెల్లడించారు.