మోదీ ‘శుభోదయం’ చెప్పిన పట్టించుకోని బీజెపీ నేతలు

SMTV Desk 2017-12-29 12:07:45  narendra modi, namo app, good morning message, bjp , new delhi

న్యూఢిల్లీ, డిసెంబర్ 29 : సామాజిక మాధ్యమాల్లో ప్రధాని మోదీ ఎప్పుడు చురుకుగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. కాగా నిన్న పార్లమెంట్ లో మోదీ బీజెపీ నేతల పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి రోజు ఉదయాన్నే మోదీ ‘నమో’ యాప్ లో భాజపా నేతలందరికీ గుడ్‌మార్నింగ్‌ సందేశం పంపిస్తారు. కానీ కేవలం ఐదు లేదా ఆరుగురు ఎంపీలు మాత్రమే తన సందేశానికి స్పందిస్తున్నారని, మిగతా వారెవరూ పట్టించుకోవడం లేదని నేతలపై అసహనం వ్యక్తం చేశారు. అంతే కాకుండా శుభోదయం శుభాకాంక్షలతో పాటు ప్రముఖ సందేశాన్ని కూడా పంపిస్తాను. దాన్ని విస్మరిస్తున్నారు’ అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.