జోహన్స్బర్గ్, డిసెంబర్ 28: చిరుతిళ్ళలో అందరూ ఎంతో ఇష్టంగా తినేది సమోసా. ఈ చలికాలంలో వేడి వేడి సమోసా తింటుంటే.. ఆహా ఆ రుచే వేరు. అటువంటి సమోసాకు దక్షిణాఫ్రికాలో అరుదైన గౌరవం లభించింది. తాజాగా దక్షిణాఫ్రికాలో భారత కమ్యూనిటీ కోసం నిర్వహించే వీక్లీ పోస్ట్ అనే మీడియా సంస్థ ఇటీవల చిరుతిళ్ల పోటీ పెట్టింది. ఈ పోటిల్లో కాశ్మీర్ చిల్లి చికెన్తో చేసిన సమోసా విజేతగా నిలిచింది. ఇందులో ఛాక్లెట్, జీడిపప్పు వంటకాలు, పిజ్జాల లాంటి వంటకాలను సైతం వెనక్కి నెట్టింది ఈ సమోసా. సల్మా అగ్జే అనే మహిళ ఈ సమోసాను తయారుచేశారు. ఈ పోటీలో తన వంటకం గెలవడం ఆనందంగా ఉందని, తనకు వంట చేయడం చాలా ఇష్టమని సల్మా చెప్పారు. వంటకాల్లో ఎప్పుడూ ప్రత్యేక రుచి ఉండేలా చూసుకుంటానని అన్నారు.